హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో కొత్త ఎమ్మెల్యేలకు పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్ పచ్చికబయళ్ళలో జరిగే మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం పదిమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలని కేసీఆర్ సంకల్పించారు. మంత్రివర్గంలోకి ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీష్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, చామకూర మల్లారెడ్డిలను చేర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఈ పది మందిని ప్రమాణ స్వీకారానికి రావాలని సమాచారం అందించారు. ఇందులో తలసాని, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్లు సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.