ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యవహారం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఉదయ్సింహ ఈడీ అధికారుల ఎదుట హాజరుకాగా… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుకాన్నారు. రేవంత్ చెప్పే సమాధానాలను బట్టీ మళ్లీ ఉదయసింహను ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.