కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. వీరంతా ఇప్పటికే రాజ్భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గతంలో మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు కొత్తగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. గవర్నర్ నరసింహన్.. పది మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఇక పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్భవన్కు చేరుకోవడంతో అక్కడ సందడిగా మారింది. కేబినెట్ విస్తరణ కార్యక్రమం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాజ్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. ఈ సారి విస్తరణలో కేటీఆర్, హరీష్ రావులను స్థానం దక్కని సంగతి తెలిసిందే.