హైదరాబాద్ : మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహం మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తరువాత తలసాని శ్రీనివాసయాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తలసాని శ్రీనివాసయాదవ్ కూడా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. తలసాని తరువాత జగదీశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మంత్రిగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈటల గతంలో ఆర్థిక శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ఎల్పి నేతగా వ్యవహరించారు.