తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రాజ్భవన్ వేదికగా జరిగింది. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్ శ్రీ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ… లక్ష్మీ పార్వతి అడ్డుకున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రిగా అవకాశం కల్పిస్తానని చెప్పారని.. కానీ.. ఆయన తన మాటను నిలబెట్టుకోలేదని తెలిపారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తన మాటను నిలబెట్టుకున్నారని.. ఈసారి మంత్రి పదవి ఇస్తున్నారని.. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణ పడి ఉంటానని ఎర్రబెల్లి తెలిపారు.