రాష్ట్రానికి విచ్చేసిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యుల బృందం ఇవాళ ఉదయం ఛార్మినార్ ను సందర్శించింది. చైర్మన్ శ్రీ నందకిషోర్ సింగ్,సభ్యులు డా. అనూప్ సింగ్, డాక్టర్.రమేష్ చంద్, జాయింట్ సెక్రటరీ ముక్ మిత్ సింగ్ భాటియా, మీడియా సలహాదారు మౌసమీ చక్రవర్తి, డైరెక్టర్లు గోపాల్ ప్రసాద్, భరత్ భూషణ్ గార్గ్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ పర్మార్, డిప్యూటి డైరెక్టర్ నితీష్ షైనీ, అస్టిస్టెంట్ డైరెక్టర్ సందీప్ కుమార్, డి.డి.ఓ. డి.కె.శర్మ, పీఎస్. త్యాగరాజన్ లకు జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ ఘన స్వాగతం పలికారు. చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆర్థిక సంఘం ఛైర్మెన్, ప్రతినిధులు తిలకించారు. ఛార్మినార్ ప్రదర్శన తరువాత హైదరాబాద్ ఇరానీ చాయ్ ను ఆర్థిక సంఘం ఛైర్మెన్ నంద కిషోర్ సింగ్, సభ్యులు ఆస్వాదించారు. కుతుబ్ షాహీ ల నిర్మాణ శైలి ని చార్మినార్ లో చూసి మంత్రముగ్దులయ్యారు. ఆ తరువాత ఫలక్ నుమా ప్యాలెస్ ను సందర్శించారు. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటిగా ఫలక్ నుమా ప్యాలెస్ అని, 1884 లో వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారన్నారు. ఫలక్ నుమా అంటే ఆకాశ స్వర్గం అని, 32 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్యాలెస్ ను 1897 లో 6 వ నిజామ్ కు వికార్ ఉల్ ఉమ్రా బహూకరించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ గౌరవార్థం ఫలక్ నుమా ప్యాలెస్ లో ఆర్థిక సంఘం ప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం ఛైర్మెన్ ఎన్.కే. సింగ్ కు చార్మినార్ మెమెంటో ను బహుకరించారు.