తెలంగాణ రాష్ట్రం లో రెండవ సారి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి హదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి తనపై మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభవృద్ధి లో పాలుపంచుకుంటానని అన్నారు. మంత్రి గా అవకాశం ఇచ్చిన సీఎం కెసిఆర్ కి, ఎమ్మెల్యే గా గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు.