రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రభుత్వం కార్మిక క్షేత్రానికి పట్టాభిషేకం చేస్తున్నది. పేదలందరికీ పట్టాలిచ్చేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. టైటిల్తో బ్యాంకు రుణాలు, సర్కార్ సంక్షేమ పథకాలు వర్తించేలా ఇండ్ల స్థలాలకు పక్కాగా పట్టాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. గతంలో సర్కార్ పంపిణీ చేసిన స్థలాలకు ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో పట్టాలు అందుకోబోతున్నారు. మూడువేల మంది దరఖాస్తులు చేసుకోగా వారందరికీ నేడు పట్టాలు ఇస్తున్నారు. దీంతో మూడున్నర దశాబ్దాల కల సాకారం అవుతున్నందుకు బీడీ, నేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.