ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర సంతాపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 10:28 AM

మాజీ శాసనసభ్యులు నంద్యాల శ్రీనివాస్ రెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటంలో నంద్యాల పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుందన్నారు. సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా ఆయన చూపించిన తెగువ వర్తమానానికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అటువంటి ఉద్యమ నేత ను కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను పేదలకు పంచిన మహానేత అని, ఉరిశిక్షను సైతం ఖాతరు చెయ్యకుండా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసికెళ్లిన ధీశాలి అని కొనియాడారు. సమితి ప్రెసిడెంట్ గా శాసనసభ్యుడిగా ఆయన అందించిన సేవలు చరిత్రలో నిలిచి పోతాయన్నారు. ఆయన అందించిన స్పూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com