యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల గజదీష్రెడ్డి కుటుంబ సమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునితామహేందర్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.