హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి హైదరాబాద్లోని ఎంపీ నివాసానికి విచ్చేశారు. ఎంపీ కవిత.. శ్రీనివాస్గౌడ్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేబినెట్లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరింత పేరు తెస్తానని మంత్రి పేర్కొన్నారు.