హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్రెడ్డి, శాసనసభ కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ట్రాఫిక్ డీసీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.