సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్లో కారు దగ్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కారులో ఇద్దరు సజీవ దహనం కాగా, మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కారులో చెలరేగుతున్న మంటలను ఆర్పివేశారు.