న్యూఢిల్లీ: సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై ముచ్చటించారు. ప్రిన్స్ సల్మాన్ మంగళవారం రాత్రి భారత్కు వచ్చారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ... మోదీ ఆయనకు స్వాగతం పలికారు. వాస్తవానికి ప్రిన్స్ సల్మాన్ రెండు రోజులు పాక్లో పర్యటించారు. అక్కడ నుంచి నేరుగా భారత్కు రావాల్సి ఉంది. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ నుంచి ఎవరూ నేరుగా భారత్కు రాకూడదన్న నిబంధనను పాటించారు. దీంతో ప్రిన్స్ సల్మాన్ మళ్లీ రియాద్కు వెళ్లి.. అక్కడ నుంచి భారత్కు వచ్చారు. ప్రిన్స్ సల్మాన్ను మోదీ తన నివాసానికి కూడా తీసుకువెళ్లారు. ఈ ఇద్దరూ కాసేపట్లో ఉగ్రవాద నిర్మూలనపై ఓ ప్రకటన చేయనున్నారు.