యాదగిరిగుట్ట లో శ్రీ పంచరూప లక్ష్మీనరసింహ స్వామి వారిని విద్యాశాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి జగదీశ్వర్, ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీతామహేందర్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.