ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.282 కోట్లతో చెరువుల సుందరీకరణ పనులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 02:30 PM

హైదరాబాద్‌:నగరంలో రూ.282.5 కోట్లతో చెరువుల సుందరీకరణ పనులు చేపట్టామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. నగరంలో మొత్తం 19 చెరువులకు గానూ 12 చెరువుల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. రూ.19కోట్లతో గంగారాం పెద్దచెరువు, రూ.12.5కోట్లతో మియాపూర్‌ పటేల్‌ చెరువు, రూ.25.34కోట్లతో ప్రగతినగర్‌ చెరువుల అభివృద్ధి చేపట్టినట్లు కమిషనర్‌ వివరించారు. చెరువుల్లో డ్రైనేజీ, మురుగునీరు చేరకుండా మళ్లింపు కాల్వలు నిర్మించాలని అధికారులకు సూచించారు. సివరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ల ఏర్పాటు, చెరువు కట్టల ఎత్తు పెంచడం పనులను మే నెలాఖారులోగా పూర్తి చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. ప్రగతినగర్‌, గంగారం పెద్ద చెరువు, పటేల్‌ చెరువులను దానకిశోర్‌ సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com