ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక డిశ్చార్జి అయ్యింది. పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం కుదుటపడడంతో ఆమెను డాక్టర్లు డిశ్చార్చ్ చేశారు. ఆమె వైద్య చికిత్సకు 10 లక్షల రూపాయలు ఖర్చు కాగా.. అందులో 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారు. అమ్మాయి ఆరోగ్యం మెరుగుపడిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. యశోద వైద్యులకు, మీడియా, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మధులిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ తమకు కౌన్సెలింగ్ ఇచ్చారని,
శనివారం మరోసారి హాస్పిటల్కు తీసుకురమ్మని చెప్పారని తండ్రి రాములు తెలిపారు. దాడికి పాల్పడిన భరత్ని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనికి ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరాడు.