పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్టాల పంపిణీ సిరిసిల్ల కార్మికుల 40 ఏళ్ల కల అని పేర్కొన్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపడేలా డబుల్ బెడ్రూంల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పట్టాల పంపిణీ, డబుల్ బెడ్రూంల విషయంలో దళారులను నమ్మొద్దని సూచించారు. బతుకమ్మ చీరలతో సిరిసిల్లకు ఉపాధి దొరికిందన్నారు. రానున్న రోజుల్లో సిరిసిల్లకు జలకల సంతరించుకోనుందన్నారు.