డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తరుణంలో ఆన్లైన్ వినియోగదారులే టార్గెట్గా మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలు జరిపే మొబైల్ ఫోన్ యూజర్లు కోన్ని యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ‘ఎనీ డెస్క్’ అనే ఓ మొబైల్ యాప్ ద్వారా ‘యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది. యూజర్ల మొబైల్స్లోని డేటాను చోరీ చేసి.. నేరగాళ్లు మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.