మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రజా విజ్ఞప్తుల మేరకు ఏపీ జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ నిధులు సత్వర మంజూరయ్యేలా కృషి చేసారు. మైలవరం పట్టణంలో ఉన్న 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా విస్తరించారు. ఇందుకు ప్రభుత్వం రూ.3కోట్లు రూపాయలు మంజూరు చేసిందని మంత్రి ఉమా బుధవారం తెలిపారు. ఏటా 60.34లక్షల వ్యయంతో ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ తోపాటు 15 మంది ఇతర విభాగలకు చెందిన స్టాఫ్ భర్తీకి కూడా జివో విడుదలైనట్లు చెప్పారు. కాగా, ఇబ్రహీంపట్నంలోని వడ్డెర కమ్యునిటీ భవనానికి రూ.20లక్షలు, దాములూరులోని మైనార్టీ షాదీఖానాకు రూ.30లక్షలు మంజూరైనట్లు మంత్రి ఉమా వివరించారు. కాగా, ఈ నిధుల విడుదల పట్ల నియోజకవర్గంలోని పలువురు బీసీ, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉమాకు అభినందలను తెలిపారు._