తెలంగాణ కొత్త మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డిలకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్ మలేషియా శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై మలేషియా శాఖ అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత మాట్లాడుతూ.. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించిన బంగారు తెలంగాణ సాధన, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా.. కొత్త మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని విభాగాల్లో ఆదర్శంగా తీసుకొనే విధంగా ముందుకు పోవాలని కోరారు. నూతన మంత్రులందరికీ ఎప్పుడూ టీఆర్ఎస్ ఎన్నారైల పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.