హైదరాబాద్: మంత్రులుగా జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబందించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉదయం 10 గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్లో కేటాయించిన 237 చాంబర్లో బాధ్యతలు స్వీకరించనుండగా, వ్యవసాయశాఖ మంత్రి గా నిరంజన్రెడ్డి ఉదయం 11:25 గంటలకు తనకు కేటాయించిన 261 చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసనసభ వ్యవహారాల మంత్రిగా వేముల ప్రశాంత్రెడ్డి డీ బ్లాక్లోని 313 చాంబర్లో బాధ్యతలు చేపడ్తారు.