హైదరాబాద్: రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తొలి క్యాబినెట్ సమావేశం జరగనుంది. రెండవసారి కొలువుతీరిన తెరాస ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ తర్వాత రేపు తొలి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ సవరణ బిల్లును ఆమోదించనుండగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించనున్నారు. ఈనెల 22 న అసెంబ్లీ సమావేశాలలో కెసిఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా రేపు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.