ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహశీల్ధార్ల వేతనాలు చెల్లించ్చోద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 10:40 AM

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం భూ దస్త్రాల ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూ సమస్యలు ను పరిష్కరించడం లో అలసత్వం ప్రదర్శిస్తుండ‌టంతో చాలా మంది రైతులు నిత్యం   సూర్యాపేట జిల్లాలోని మండలాల్లోని తహశీల్ధార్ కార్యాలయాల తో పాటు,ఆర్,డి,ఓ ,కలెక్టరేటుకు  వందల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. రైతుల సమస్యలను తీర్చాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తహశీల్దార్లకు సూచించారు.అయిన ఎటువంటి పురోగతి కనిపించకపోవడం తో వారి పై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరికి సంబంధించి తహశీల్ధార్లకు జీతాలు చెల్లించవద్దంటూ ఐదు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు.  దీంతో   తుంగతుర్తి,నుతనకల్, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం,చివ్వేంల్, నాగారం,మోతె,పెన్ పహాడ్,మద్దిరాల,ఆత్మకూర్ (యస్),తిరుమలగిరి,మఠంపల్లి, మేళ్ళ చెరువు,చింతల పాలెం,నడి గూడెం,కోదాడ,హుజూర్ నగర్,చిలుకూరు,మునగాల తహశీల్ధార్ల పై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని జిల్లా ఖజానా ధికారికి(సూర్యపేట) ,కోదాడ,హుజూర్ నగర్,తుంగతుర్తి ఉప ఖాజానాధికారులకు ఆదేశాలిచ్చారు. ఉత్తర్వుల కాపీ తో పాటు ఎల్ఆర్ యూపీ ప్రగతి నివేదికను జత చేశారు.తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆదేశాలు పాటించాలని అందులో పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com