ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లో ఒక ఫుడ్ స్టాల్ ఓనర్ తన కస్టమర్లకు చికెన్ లెగ్ పీస్పై 10 రూపాయిలు తగ్గించి విక్రయిస్తున్నాడు. అయితే దీనికి ఆయన ఒక షరతు పెట్టాడు. అక్కడికి వచ్చిన వారు మనస్ఫూర్తిగా పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేయాలి. అంజల్ సింగ్ అనే ఒక ఫుడ్ స్టాల్ ఓనర్ ఈ పద్ధతి ప్రవేశపెట్టాడు. మానవతా విలువలను పాకిస్తాన్ ఎన్నడూ గౌరవించలేదని, ఎన్నడూ గౌరవించదని అంజల్ సింగ్ చెప్పాడు. అందుకే ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అనాలని, అది కూడా మనస్ఫూర్తిగా అనాలని అంజల్ సింగ్ అన్నాడు.