విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెలంగాణ రాష్ట్ర రోర్డు రవాణా సంస్థకు చెందిన వోల్వో బస్సులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకసిబ్బంది... మంటలు బస్సు మొత్తం వ్యాపించకుండా అదుపుచేశారు.