మూడు టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య రెండో టీ20 గౌహతి స్టేడియంలో మరొకొద్ధి సేపట్లో ప్రారంభం కానుంది. ఈ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడిన భారత్.. ఈ మ్యాచ్లో సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ రెండో టీ20లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.