తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి ఫలితాలను కోరుకోవడం లేదు. అందుకే అధికార పార్టీకన్నా ముందే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముమ్మరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అధినేత రాహుల్ గాంధీ కూడా తాజాగా జరిగిన శంషాబాద్ బహిరంగసభతో ప్రచారరంగంలో దిగిపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పలువురు కీలక నేతల పేర్లతో కూడిన ఓ జాబితా ఇప్పుడు బయటపడడం చర్చనీయాంశంగా మారింది.
1. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా జానారెడ్డి
2 భువనగిరి నుండి పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
3.వరంగల్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగ మందకృష్ణ మాదిగ
4.కరీంనగర్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి
5.నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా నంది ఎల్లయ్య
6.మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి గా D.K అరుణ
7.నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ
8.మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మధు యాస్కీ
9.హైదరాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా అజారుద్దీన్.
10.సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్
11.చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి
12.పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సంపత్ కుమార్
13.మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా చీమల వెంకటేశ్వర్ల
14.జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మదన్మోహన్ రావు
15.అదిలాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా సునితా
16.మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి
17.ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి సుధాకర్ రెడ్డి.
ప్రస్తుతం ఇదే జాబితా వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.