తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మరికాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఇప్పటికే 14 స్థానాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించామన్నారు. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలన్నారు. రాష్ట్రం కోసం, సీఎం పదవి కోసం జరుగుతున్న ఎన్నికలు కాదన్నారు. ప్రత్యర్థుల ప్రధాని అభ్యర్థి ఎవరంటే సమాధానం లేదన్నారు. కేంద్రంలో ఎవరి సహకారం లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సంసిద్ధతపై అమిత్షాతో చర్చించబోతున్నామన్నారు. టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని అన్నారు. దేశంలో చక్రం తిప్పడం కాదు.. తెరాస ముందు తమ ఇల్లు చక్కదిద్దుకోవాలన్నారు. హరీశ్రావుకు కేటీఆర్, కేటీఆర్కు హరీశ్రావు పోటీగా ఉన్నారన్నారు. బీజేపీపై వస్తున్న సర్వేలు వాస్తవం కాదన్నారు. దేశాభివృద్ధి కోసం మోడీకి మరోసారి అవకాశమివ్వాలన్నారు. నోట్ల రద్దు, ఈబీసీలకు రిజర్వేషన్ అంశాలు బీజేపీకు అనుకూలమన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అంశం బీజేపీకు అనుకూలంగా ఉందన్నారు. ఎవరి సహకారం లేకుండానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.