తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్ బీ ఫామ్పై పోటీకి తాను సిద్ధమని హరిప్రియ ప్రకటించారు. ఇల్లెందు అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు