హైదరాబాద్ :తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. రేపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక జరుగనున్నది. ఐదు ఖాళీలకు టిఆర్ఎస్, ఎంఐఎం తరఫున ఐదుగురు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కాంతారాఇవు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ పార్టీ మారడంతో కాంగ్రెస్కు తగిన సంఖ్యాబలం లేకుండా పోయింది. స్టేట్స్మన్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్ చర్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులను కెసిఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.