ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌తో ఏమీ కాదని తేలిపోయింది: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 04:22 PM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2001లో జెడ్పీ ఎన్నికల్లో మొత్తం ఆలేరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌తో ఏమీ కాదని అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు ప్రజల చేత తిరస్కరించబడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో..కార్యకర్తలు గ్రామగ్రామాన వివరించాలని కేటీఆర్ కోరారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com