పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కోరుతూ ఉద్యమాలు చేసిన పటేల్ సామాజికవర్గం నేత హార్థిక్ పటేల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అహ్మెదాబాద్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ హార్థిక్ పటేల్కి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హార్థిక్ పటేల్కి జామ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించేందుకు పార్టీ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
గుజరాత్లోని పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమానికి తెరలేపిన యువ నాయకుడు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి అందుబాటులో ఉన్ననేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.