హైదరాబాద్ : నగరంలో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి విలువైన కొకైన్, హెరాయిన్, కెమికల్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రెండు రాష్ర్టాల్లో భారీగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.