తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మల్లారెడ్డికి వేదపండితులు వేదశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రితో కలిసి ఎం ఎల్ ఆర్ రాజశేఖర్ రెడ్డి , పలువురు మల్కాజిగిరి తెరాస నాయకులు స్వామి వారిని దర్శించుకున్నారు.