సీఎం కేసీఆర్ బహిరంగ సభ దేశ రాజకీయ చర్చలకు వేదిక కాబోతుందని ఎంపీ వినోద్ అన్నారు. కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తిగా టీఆర్ఎస్ అవతరించబోతుంది. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో విభజన చట్టంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. విభజన చట్టంలోని లోపాలను సవరణ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలవాలి. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. అని వినోద్ వివరించారు.