తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో తొలి విడతగా 8 స్థానాలకు ఆమోదం లభించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇంకా 9 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. నలుగురు మాజీ ఎంపీలు అయిన బలరాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ రాథోడ్, పొన్నం ప్రభాకర్ లకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. కొత్తగా రేవంత్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఎ.చంద్రశేఖర్, మదన్ మోహన్ కు సీట్లు కేటాయించారు.
1.ఆదిలాబాద్ - రమేష్ రాథోడ్
2. మహబూబాబాద్ – పోరిక బలరాం నాయక్
3.పెద్దపల్లి - ఎ.చంద్రశేఖర్
4.కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
5.మల్కాజిగిరి – ఏ. రేవంత్ రెడ్డి
6. జహీరాబాద్ - మదన్ మోహన్ రావు
7. చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
8.మెదక్ - గాలి అనిల్ కుమార్.