ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి స‌న్నిధిలో సత్యవతి రాథోడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 12:03 PM

 తిరుమల శ్రీవారిని టీఆర్‌ఎస్ సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య సమయంలో ఆమె స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్ర్తాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. 


గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించిన టీఆర్‌ఎస్… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ ఘనతనే పునరావృతం చేసింది. పార్టీ తరఫున బరిలో దిగిన నలుగురు అభ్యర్థులు గ్రాండ్‌ విక్టరీ కొట్టారు. హోం మంత్రి మమమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం… శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ కు మెజార్టీ ఎమ్మెల్యేల బలం ఉండటంతో… ఆ నలుగురి గెలుపు సులువైంది. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com