ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 11:11 AM

 వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్‌ రెడ్డి నగర్ నుంచి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు వంశీ(20), సాయి(20) గుర్రంగూడకు చెందిన విద్యార్థులు కాగా.. వనస్థలిపురానికి చెందిన గణేష్(21) అనే మరో యువకుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com