హైదరాబాద్ : మహిళల భద్రతపై అవగాహన కల్సిస్తూ హైదరాబాద్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో పరుగు నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ ఈ పరుగును ప్రారంభించారు. 10కె, 5కె, 2కె విభాగంలో నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్ రహదారి మీదుగా పరుగు కొనసాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, సినీనటులు పూజా హెగ్డే, నిహారికతోపాటు క్రీడాకారిణి సైనా జేస్వాల్తోపాటు పలువురు ఇందులో పాల్గొన్నారు.