గోవా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హాతో సమావేశమయ్యారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వారు గవర్నర్కు విన్నవించారు. గోవా శాసనసభలో ప్రతిపక్ష నేత కావ్లేకర్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్భవన్కు వచ్చారు. గవర్నర్ తమకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని కేవ్లేకర్ చెప్పారు. అందుకే తాము నేరుగా గవర్నర్ను కలవడానికి వచ్చామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాల్సిన అవసరం ఏముంటుందని ఆయన అన్నారు.