టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ యువనేత క్రిషాంక్ తోపాటు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.పాలన నచ్చి పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరుతుంటే కాంగ్రెస్ నాయకులు , అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. ఇద్దరు ఎంపీలతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ తీసుకువచ్చారు. 16 మంది ఎంపీలతో ఏం సాధిస్తామో నిన్న కేసీఆర్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేనిచోటే జాతీయ పార్టీలు ఉనికి చాటుతున్నాయి. మిగతా చోట్ల కనుమరుగై పోయే పరిస్థితి నెలకొందన్నారు.
మోదీని నమ్మి కేంద్రంలో మంచి మెజారిటీతోగెలిపిస్తే.. ఆయన దేశానికి మిగిల్చింది శుష్కప్రియాలు, శూన్యహస్తాలే అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఆడబిడ్డల పోపు డబ్బాలను దోచుకున్నప్పుడే.. మోదీ ప్రతిష్ఠ మసనబారిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రైతు బంధు పథకాన్ని మోదీ కాపీ కొట్టారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలోని లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
In the presence of TRS Working President Sri @KTRTRS, leaders of various parties joined TRS party at a programme in Telangana Bhavan today.#TelanganaWithKCR #VoteForCar #MissionTRS16 pic.twitter.com/pJIiDlquZk
— TRS Party (@trspartyonline) March 18, 2019