హైటెక్ సిటీ మెట్రో కు ముహూర్తం ఖరారు.ఎల్లుండి ఉ.9.30 గంటలకు హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం.అమీర్పేటలో జెండా ఊపి ప్రారంభించనున్న గవర్నర్ . హైదరాబాద్లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. నగరంలో ట్రాఫిక్ను తగ్గించడమే కాకుండా ప్రయాణం వేగవంతం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇప్పుడిక అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ రూట్లో ప్రయాణించేందుకు సిద్ధమైన మెట్రో రైలు హైదరాబాద్లో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైపోయింది.