తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మెదక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్లో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ‘అది చక్కని నిర్ణయం. దీన్ని ఏడాదిలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కేసీఆర్కు నేను ఆయనకు సంగారెడ్డిలో గుడి కట్టిస్తాను.. అంతేకాదు, తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీకి కూడా గుడి నిర్మిస్తాను’ అన్నారు. టీఆర్ఎస్లో చేరాలని ఆ పార్టీ తనను ఆహ్వానించ లేదని, తనను అందులోకి తీసుకోరని ఇటీవల అన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించనని కూడా అన్నారు. అయితే విమర్శించను అని అంటూనే ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. .