ఇటివల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫు నుండి నల్లగొండ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడి పరిస్థితి ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఇప్పటికే శాసనసభ హోదాలో ఉన్న ఉత్తంకుమార్ రెడ్డిని కావాలనే పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే నల్లగొండ బరిలో దించిండు అని అంటారు. ఇటీవల జరిగిన హోరాహోరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలో దిగి గెలుపొందిన అభ్యర్థుల్లో ఉత్తంకుమార్ రెడ్డి ఒకరు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తం మరోక్కసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగటం అనేది కొంతవరకు సాహసమే అని చెప్పాలి మరి! అయితే ఇప్పడు ఉత్తంకుమార్ రెడ్డి పెద్దతలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పడు కానీ లోక్ సభ ఎన్నికల్లో నెగ్గలేదంటే ఇక ఉత్తం పని ఉత్తదే అని అనుకుంటున్నారు ప్రజలు. అంతటితో రాజకీయానికి కొంతమేర దెబ్బపడుతుంది. కాగా చాలా తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులకు ఎగబాకిన వ్యక్తుల్లో ఉత్తంకుమార్ అనే చెప్పవచ్చు అయితే ఇప్పడు గెలవకపోతే ఉత్తం పరిస్థితి ఎంటి? ఇక రాజకీయంలో కీలక పదవులు దక్కే అవకాశాలు తక్కువై పోతాయి. రాజకీయ భవితవ్యం దెబ్బ తింటుందనే చెప్పవచ్చు.