27వ తేదీన హైదరాబాద్ లో అంబేద్కర్ మహాగర్జనకు ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గర్జనకు ప్రకాష్ అంబెద్కర్, జజ్ఞేష్ మేవాని, ఖర్గే, మీరాకుమారి, బీమ్ ఆర్మీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ వస్తారని తెలిపారు. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ గర్జన కు వస్తాయన్నారు. అంబెడ్కర్ ను అవమానించిన కేసీఆర్ తగిన మూల్యం చెల్లించు కొక తప్పదని అన్నారు. ఎన్ని నిర్భందాలు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. అంబెడ్కర్ మాకు దేవుడని, 22వ తేది వరకు ఎంఆర్పీఎస్ ఇచ్చిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను ప్రశ్నించడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంబెద్కర్ ను గౌరవించని వ్యక్తులలో కేసీఆర్ మొదటి వాడని విమర్శించారు. అంబెద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తిస్తుoటే... కేసీఆర్ ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి అంబెద్కర్, పూలే, జగ్ జీవన్ రావు, కొండ లక్ష్మణ్ బాపూజీకు ఎప్పుడూ కనీసం పూల దండ కూడా వేయలేదన్నారు. ఈ సమావేశానికి జాజుల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.