హైదరాబాద్ : ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశినుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన రైతులు బయలుదేరి వెళుతున్నారు. ఆర్మూర్కు చెందిన 50 మంది పసుపు రైతులు వారణాశిలో తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నెల 27వ తేదీన ఆర్మూర్ రైతులు ర్యాలీగా వెళ్లి తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారికి తమిళనాడు రైతులు మద్దతు ప్రకటించారు. నేడు రైలులో వారణాశికి వారు బయలుదేరి వెళ్లనున్నారు.