ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు ఓటములు ఎంతో బాధించాయి : కోహ్లీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2019, 12:01 PM

 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వచ్చేస్తోంది. వరుసల విజయాలతో హ్యాట్రిక్‌ సాధించడంతో ఆర్సీబీ అభిమానులకు ప్లే ఆఫ్స్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. బుధవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. చావోరేవో అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో విజయయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అట్టడుగు స్థానాన్ని రాజస్థాన్‌కు అప్పజెప్పి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. అయితే, మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మాట్లాడాడు.


‘వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడటం మమ్మల్ని ఎంతో బాధించింది. కానీ, మా ఆటగాళ్లు ఎవరూ ఆ ఒత్తిడిలో కుంగిపోలేదు. ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. మేం ఎలా ఆడామన్నది మాకు తెలుసు. ప్రపంచానికి కూడా తెలుసు. జట్టుగా ఆడటం మంచి ఫలితాలను తెచ్చి పెడుతుందని మేం నమ్మాం. మేము చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయాలు సాధించాం. ఆ ఒక్కదాంట్లో కూడా గెలిచి ఉండాల్సింది. అయితే, క్రికెట్‌ను ఎంత ఆస్వాదిస్తూ ఆడితే అంత ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మ్యాచ్‌లో మా జట్టు ఆటతీరే అందుకు ఉదాహరణ. స్టొయినీస్‌, డివిలియర్స్‌ కలిసి మ్యాచ్‌కు మంచి పునాది వేశారు. 175 పరుగుల లక్ష్యం నిర్దేశించగలిగితే చాలు అనుకున్న సమయంలో వాళ్లిద్దరూ చెలరేగి 200 పరుగుల మైలురాయి దాటించారు. ఈ విజయంలో కీలక పాత్ర వాళ్లదే’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. తన తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com