హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో గందరగళంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని మంత్రుల క్వార్టర్స్ వద్ద బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.