త్వరలో వెలువడనున్న పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానన్న అనుమానంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పగూడ కృష్ణానగర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే నరేశ్ అనే బాలుడు ఇటీవలే పదోతరగతి పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఫెయిల్ అవుతానని భయపడిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా అసుపత్రికి తరలించారు.